ఉత్తరాదిలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం తమ భూములకు పరిహారం, ప్రయోజనాలు కోరుతూ వారు ఢిల్లీకి బయలుదేరారు. యూపీలోని పలు ప్రాంతాల నుంచి బయలుదేరిన రైతుల్ని అడ్డుకోవడానికి కేంద్రం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించింది. అదే సమయంలో యూపీ-ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేసింది. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో రైతుల నిరసనలు చర్చనీయాంశనీయమయ్యాయి.
కేంద్రం కొత్తగా తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలతో కూడిన ఐదు కీలక డిమాండ్లను రైతులు తెరపైకి తెచ్చారు. వీటిపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడానికి ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వేదికగా ఎంచుకున్నారు. ఢిల్లీలోని నోయిడా నుండి పార్లమెంట్ కాంప్లెక్స్ వరకు నిరసనగా వెళ్లి తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. కేంద్రం అప్రమత్తమైంది.