డైరెక్టర్ రాజమౌళి, ప్రిన్స్ మహేశ్బాబు కాంబోలో తెరకెక్కనున్న ‘SSMB29’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో అనేక రకాల సెట్ వర్క్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో మూవీ షూటింగ్ ప్రారంభించేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరోవైపు నటీనటుల ఎంపికపై రాజమౌళి ప్రత్యేకంగా దృష్టిపెట్టారని, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో విలన్గా నటించనున్నట్లు టాక్.