E-PAPER

టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల..

ఏపీలో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ లిస్టులో టీడీపీ అభ్యర్థులకు ప్రాముఖ్యతనిచ్చారు. మొత్తం 94 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. ఇందులో టీడీపీ 89, జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం సీట్లలో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తొలిజాబితాలో జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలకు రెండో లిస్టులో అభ్యర్థులను ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

 

తెలుగు-సేన అభ్యర్థుల జాబితా

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా

 

ఆముదావలస – కూన రవికుమార్

ఇచ్ఛాపురం – బెందాలం అశోక్

టెక్కలి – అచ్చెన్నాయుడు

 

ఉమ్మడి విజయనగరం జిల్లా

 

రాజాం(SC) – కొండ్రు మురళీమోహన్

సాలూరు – గుమ్మడి సంధ్యా రాణి

విజయనగరం – అదితి విజయలక్ష్మి గజపతిరాజు

బొబ్బిలి – బేబి నాయన

గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్

కురుపాం(ST) – తొయ్యక జగదీశ్వరి

పార్వతీపురం (SC) – విజయ్ బోనెల

 

ఉమ్మడి విశాఖ జిల్లా

 

అరకు – సియ్యారి దొన్ను దొర

అనకాపల్లి – పీలా గోవింద్

నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు

విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ వెస్ట్ – గణ బాబు

పాయకారావు పేట – వంగలపూడి అనిత

 

ఉభయ గోదావరి జిల్లాలు

 

కొత్తపేట – బండారు సత్యానందరావు

మండపేట – జోగేశ్వర రావు

జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

పెద్దాపురం – చిన రాజప్ప

తుని – యనమల దివ్య

అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి

రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్

పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

ఆచంట – పితాని సత్యనారాయణ

తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ

ఉండి – మంతెన రామరాజు

చింతలపూడి – సొంగా రోషన్

దెందులూరు – చింతమనేని ప్రభాకర్

ఏలూరు – బడేటి రాధాకృష్ణ

రాజానగరం – బత్తుల రామకృష్ణారెడ్డి

ముమ్మిడివరం – దట్ల సుబ్బరాజు

గన్నవరం (SC) – సరిపెళ్ల రాజేష్ కుమార్

 

ఉమ్మడి కృష్ణాజిల్లా

 

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ – వెనిగండ్ల రాము

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య

తిరువూరు – కోలికపూడి శ్రీనివాస్

నందిగామ (SC) – తంగిరాల సౌమ్య

విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు

విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్

నూజివీడు – కొలుసు పార్థసారథి

పెడన – కాగిత కృష్ణప్రసాద్

పామర్రు (SC) – వర్ల కుమార రాజా

 

ఉమ్మడి గుంటూరు జిల్లా

 

మంగళగిరి – నారా లోకేష్

పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర

ప్రత్తిపాడు (SC) – బూర్ల రామాంజనేయులు

తాడికొండ (SC)- తెనాలి శ్రావణ్ కుమార్

చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ

రేపల్లె – అనగాని సత్యప్రసాద్

వేమూరు – నక్కా ఆనంద్ బాబు

బాపట్ల – వేగెశ్న నరేంద్ర వర్మ

వినుకొండ – జీవీ ఆంజనేయులు

 

ఉమ్మడి ప్రకాశం జిల్లా

 

అద్దంకి – గొట్టిపాటి రవికుమార్

పర్చూరు – ఏలూరి సాంబశివ రావు

కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

కొండెపి – డోలా బాల వీరాంజనేయులు

ఒంగోలు – దామచర్ల జనార్దన్

ఎర్రగొండపాలెం (SC) – గూడూరి ఎరిక్సన్ బాబు

మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి

సంతనూతలపాడు(SC) – బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్

 

ఉమ్మడి నెల్లూరు జిల్లా

 

నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి

గూడూరు (SC)- పాశం సునీల్

కావలి – కావ్య కృష్ణారెడ్డి

సూళ్లూరుపేట (SC) – నెలవెల విజయశ్రీ

ఉదయగిరి – కాకర్ల సురేష్

 

ఉమ్మడి అనంతపురం జిల్లా

 

హిందూపురం – బాలకృష్ణ

తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి

రాప్తాడు – పరిటాల సునీత

ఉరవకొండ – పయ్యావుల కేశవ్

రాయదుర్గం – కాలువ శ్రీనివాసులు

సింగనమల (SC) – బండారు శ్రావణిశ్రీ

కల్యాణదుర్గం – అమిలినేని సురేందర్ బాబు

మడకశిర (SC) – ఎంఈ సునీల్ కుమార్

పెనుకొండ – సవిత

 

ఉమ్మడి కడప జిల్లా

 

కడప – రెడ్డప్పగారి మాధవి

పులివెందుల – బీటెక్ రవి

మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

రాయచోటి – రాం ప్రసాద్ రెడ్డి

 

ఉమ్మడి కర్నూల్ జిల్లా

 

కర్నూలు – టీజీ భరత్

నంద్యాల – NMD ఫరూక్

పాణ్యం – గౌరు చరితా రెడ్డి

పత్తికొండ – కేఈ శ్యాం

శ్రీశైలం – రాజశేఖర్ రెడ్డి

ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ

బనగానపల్లె – బీసీ జనార్థన్ రెడ్డి

డోన్ – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

పత్తికొండ – కేఈ శ్యామ్ బాబు

కోడుమూరు – బొగ్గుల దస్తగిరి

 

ఉమ్మడి చిత్తూరు జిల్లా

 

తంబళ్లపల్లె – జయచంద్రరెడ్డి

పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

నగరి – గాలి భానుప్రకాష్

గంగాధర నెల్లూరు (SC) – డా. వీ.ఎం తోమస్

చిత్తూరు – గురజాల జగన్ మోహన్

పలమనేరు – ఎన్. అమర్నాథ్ రెడ్డి

కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

 

అభ్యర్థుల జాబితా ప్రకటన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన ఓట్ షేర్ చీలకూడదని భావిస్తున్నామన్నారు. సిద్ధం సిద్ధం అని చించుకుంటున్న అధికార పక్షం ఇక యుద్ధానికి సిద్ధం కావాలన్నారు.

 

శనివారం ఉదయం 9 గంటలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు,

పయ్యావుల కేశవ్‌, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, నక్కా ఆనంద్‌బాబుతో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ అధినేత చర్చించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram