E-PAPER

‘అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి.. 2 లక్షల ఉద్యోగాలిస్తాం’..

కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెక్లెస్‌రోడ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం నిర్వహించిన సింగరేణి ఉద్యోగ మేళాలో (Singareni Job mela) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

 

కార్యక్రమంలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల కోసం అభ్యర్థులు తేదీల గురించి ఆలోచించకుండా సన్నద్ధం కావాలని చెప్పారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. గత ప్రభుత్వం ఒక కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు ఊడగొడితే.. ఇప్పుడు 441 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇలాగే 2లక్షల మందికి ఉద్యోగాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీతోపాటు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతి కుమారి.

Facebook
WhatsApp
Twitter
Telegram