E-PAPER

క్రీడల్లో రాణించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించింన – ప్రిన్సిపాల్ తిరుమల్ ..

పత్రిక ప్రకటన : తేదీ: 05.02.2024

 

క్రీడల్లో రాణించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించింన

– ప్రిన్సిపాల్ తిరుమల్

 

మరో ఉదయం,సిద్దిపేట జిల్లా : ఫిబ్రవరి05, శ్రీ చైతన్య విద్యాసంస్థలు సిద్దిపేట జోన్ లోని జోనల్ మీట్ లో భాగంగా సిద్దిపేటలోని రంగధాంపల్లి బ్రాంచ్ నందు గత శనివారం నాడు సిరిసిల్ల, హుస్నాబాద్,చేర్యాల, సిద్దిపేట బ్రాంచ్ లోని విద్యార్థినీ విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగంలో కబడ్డీ, కో -కో, రిలేపరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ జోనల్ మీట్ లో హుస్నాబాద్ బ్రాంచ్ నుండి కబడ్డీ జూనియర్ బాయ్స్ మొదటి బహుమతి, కబడ్డీ జూనియర్ గర్ల్స్ రెండో బహుమతి, కోకో సీనియర్స్ గర్ల్స్ మొదటి బహుమతి, 4×100 రిలే పరుగు పందెం బాయ్స్ ప్రథమ, ద్వితీయ బహుమతి సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ తిరుమల్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ తిరుమల్, ఏవో తిరుపతి,డీన్ తిరుపతి, పీఈటి రాజు, రమ్య ఉపాధ్యాయ బృందం, తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram