రంగారెడ్డి జిల్లా ప్రతినిథి ఫిబ్రవరి 4: మరి కొన్ని నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇదివరకే ఇంచార్జిలను నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు అభర్వర్లను కూడా ఆ పార్టీ నియమించింది.
సీఎం, డిప్యూటీ సీఎంకు చెరో రెండు పార్లమెంట్ నియోజీకవర్గాల బాధ్యతలు కట్టబెట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు అదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇచ్చింది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి, పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించింది.
ఇకపోతే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలకు సైతం ఇన్చార్జిలను నియమించారు. ఇందులో భాగంగా పాలమురు పార్లమెంట్ పరిధిలోని షాద్ నగర్ అసెంబ్లీకి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్ ను ఇన్చార్జిగా నియమించి అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల ఇంచార్జులను ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అందేమోహన్ తెలిపారు..