E-PAPER

సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో.. ముఖ్యమంత్రితో మేయర్ సమావేశమై పలు అంశాలను చర్చించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్, జనరల్‌ బాడీ సమావేశం నిర్వహణ, స్టాండింగ్ కౌన్సిల్ కమిటీలకు సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు.

 

ఆదివారం ఉదయం మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తో పాటు జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రాస్ ను సమావేశానికి రావాలని సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఈ సమావేశానికి తనను కూడా పిలువాలని మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram