భారతదేశ మిలిటరీ సైనికులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ రక్షణకు కృషి చేస్తారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 76వ ‘ఆర్మీ డే’ సందర్భంగా లక్నోలో నిర్వహించిన ‘శౌర్య సంధ్య’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మన పొరుగుదేశంలో ఇటువంటి పరిస్థితి లేదని పాకిస్తాన్ ఆర్మీపై పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పించారు.