E-PAPER

ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ పిలుపు.. ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

సంక్రాంతి పండగ వేళ బిఆర్ఎస్ అధినేత కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజకు కావాలని కవితకు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది.

 

మంగళవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇంతకుముందు కూడా రెండు సార్లు కవిత ఈడీ విచారణకు హాజరైంది.

 

లిక్కర్ స్కాం కేసులో మార్చి 2023లో కవితను 3 రోజుల పాటు ఈడీ విచారణ చేసింది. అయితే లోక్ సభ ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉండగా.. కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బే తగిలేలా ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram