E-PAPER

డిప్యూటీ సీఎంపై కేసు.. కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఫిర్యాదు….

ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీపై నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణస్వామి వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టారు.

 

నారాయణస్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని పోలీసులు నిర్ధరించారు. ఆయనపై 504, 505(2), r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివరాలను బేగంబజార్ సీఐ శంకర్ వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram