కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న 500 జిల్లాల్లో ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) ప్రకటించింది. న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ముగిసిన వెంటనే ట్రాక్టర్ ర్యాలీ చేపడుతామని పేర్కొంది. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్ పరేడ్ను విజయవంతం చేయాలని కోరింది.