జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పుపై చైనా తన స్పందన తెలియజేసింది. లఢఖ్ను భారత్ ఏకపక్షంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిందని ఆరోపించిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్, దాన్ని తాము గుర్తించడంలేదని అన్నారు. లఢఖ్ ఎప్పటికీ తమ భూభాగమేనని మీడియా సమావేశంలో నింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.