కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం పెరుగుతున్న ఉల్లిధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు గతంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దాంతో ఉల్లి ధరలు కాస్త తగ్గాయి. వారం గడవక ముందే ధరలు మళ్లీ పెరగడంతో.. కేంద్రం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం అమలు చేసింది.