కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదికి గానూ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు దక్కింది. భారత్ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు లభించగా వారిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంతో సరిపెట్టుకున్నారు.